మెంతి బద్దలు.తయారీ విధానము .


మెంతి  బద్దలు.

తయారీ  విధానము .

ముందుగా  ఒక  పుల్లని  మామిడికాయ పై  చెక్కు  తీసుకుని , చిన్న  చిన్న  ముక్కలుగా తరుగు కోవాలి. ముక్కలు పైన అర స్పూను  పసుపు వేసుకోవాలి.

తర్వాత   స్టౌ  మీద  బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు  వేసుకుని  నూనె బాగాకాగగానే  , పదిహేను  ఎండుమిరపకాయలు ,  ముప్పావు స్పూను మెంతులు , స్పూను  ఆవాలు  మరియు కొద్దిగా ఇంగువను వేసుకుని  పోపు  వేయించుకోవాలి. పోపులో  మెంతులు బాగా  వేగాలి. లేకపోతే  బద్దలు  చేదు  తగుల్తాయి.

పోపు  చల్లారగానే   మిక్సీ లో  ఈ వేయించిన పోపు  మరియు తగినంత  ఉప్పును వేసుకుని మెత్తని పొడిగా  మిక్సీ వేసుకోవాలి.

తర్వాత  పొడిని ఒక పళ్ళెము లోకి  తీసుకోవాలి . అందులో తరిగిన మామిడి  కాయ ముక్కలు  మరియు మూడు స్పూన్లు  కాచని నూనెను  వేసుకుని , ముక్కలను  పొడిని  చేతితో  బాగా కలుపుకోవాలి.

తర్వాత  ఒక గిన్నెలోకి  తీసుకోవాలి .

ఒక గంట సేపు  ఊరనివ్వాలి. తర్వాత  వాడుకొనవచ్చును .

ఇష్టమైన వారు పోపు మిక్సీ  వేసుకొనేటప్పుడు  చిన్న  బెల్లం ముక్క వేసుకొనవచ్చును . 
 
పదిహేను  రోజులు  నిల్వ ఉంటుంది .
https://jayakari.in/product-category/dining-table-needs/pickles/

Comments