పునాస కాపు మామిడి కాయతో పచ్చడి


పునాస కాపు  మామిడి కాయతో  పచ్చడి.

తయారీ  విధానము .

ముందుగా గట్టిగా ఉన్న పుల్లని మామిడికాయను  తీసుకుని  కాయ పై  తొక్కు తీసుకుని  , మాగాయకు ముక్కలు తరిగినట్లు నిలువుగా  ముక్కలుగా  తరుగుకోవాలి. ఈ ముక్కలు విడిగా  ఒక పళ్ళెములో  తీసుకుని , ముక్కలపై  పావు స్పూను పసుపు  వేసుకోవాలి.

తర్వాత  స్టౌ మీద  బాండీ పెట్టుకుని  నాలుగు స్పూన్లు  నూనె వేసుకుని , నూనె బాగాకాగగానే  ముందుగా  ముప్పావు స్పూను  మెంతులు వేసుకుని  , మెంతులను బాగా  వేగనివ్వాలి. తర్వాత అందులోనే   12 ఎండుమిరపకాయలు  , స్పూను  ఆవాలు  మరియు  పావు స్పూనులో  సగం ఇంగువను  వేసుకుని , పోపు వేయించుకోవాలి.

పోపు  చల్లారగానే  మిక్సీలో  వేయించిన పోపు  మొత్తము  మరియు  తగినంత ఉప్పును వేసుకుని , మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  అందులో  తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  మామిడి కాయ ముక్కలను కూడా  వేసుకుని , పచ్చడిని  మెత్తగా మిక్సీ  వేసుకోవాలి. 

తర్వాత విడిగా  ఓ గిన్నెలోకి  తీసుకోవాలి .

ఈ పచ్చడిలో  మేము   బెల్లం వేయలేదు. మీరు కావాలంటే  కొద్దిగా  బెల్లం  వేసుకొనవచ్చును .

మేము  పచ్చడి  మిక్సీ  వేసేటప్పుడు  నీళ్ళు  పోయలేదు. అందువలన  పచ్చడి  ఓ  వారం రోజులు  నిల్వ ఉంటుంది.

అంతే. భోజనము లోకి , ఇడ్లీ , దోశెలు , గారెలు మరియు చపాతీల లోకి  ఎంతో రుచిగా ఉండే  మామిడికాయ  పచ్చడి సర్వింగ్  కు  సిద్ధం.

Comments