కరివేపాకు రోటి పచ్చడి .తయారీ విధానము
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగాకాగగానే , రెండు కప్పుల కరివేపాకు , 50 గ్రాముల పొట్టు మినపప్పు , పన్నెండు ఎండుమిరపకాయలు , అర స్పూను ఆవాలు , ఇంగువ కొద్దిగా వేసుకుని పోపు వేయించుకోవాలి.
నిమ్మకాయంత చింతపండు వేడి నీళ్ళలో పావు గంట సేపు నాన బెట్టు కొని చిక్కగా రసం తీసుకోవాలి .
పోపు చల్లారగానే రోటి లో ముందు వేయించిన ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు మరియు కొద్దిగా పసుపును వేసుకుని పచ్చడి బండతో దంపుకోవాలి .
ఆ తర్వాత వేయించి సిద్ధంగా ఉంచుకున్న పొట్టు మినపప్పు కరివేపాకు మిశ్రమం , చింతపండు రసం మరియు తీపి ఇష్టమైన వారు కొద్దిగా బెల్లం వేసుకుని కొంచెం కొంచెం నీరు చల్లుకుంటూ పప్పులు పప్పులుగా పొత్రముతో రుబ్బు కోవాలి. ఈ విధముగా రుబ్బితే కరివేపాకు పచ్చడి రుచిగా బాగుంటుంది .
పొట్టు మినపప్పు తో అయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది .
పొట్టు మినపప్పు లేని పక్షంలో చాయమినపప్పు వేసుకుని పచ్చడి చేసుకొనవచ్చును .
ఈ పచ్చడి ఐదు రోజులు నిల్వ ఉంటుంది.
రోటి సౌకర్యం లేని వారు పైన నేను తెలియచేసిన పద్ధతిలోనే పచ్చడి మిక్సీ లో చేసుకొనవచ్చును.
Comments
Post a Comment