సగ్గు బియ్యము వడలు కావలసినవి .
సగ్గు బియ్యము వడలు .
కావలసినవి .
సగ్గుబియ్యం -- ఒక కప్పు
బంగాళాదుంపలు -- రెండు . ముక్కలుగా చేసి ఉడికించి పై తొక్క తీసి సిద్ధంగా ఉంచుకోవాలి
బియ్యపు పిండి -- ముప్పావు కప్పు
శనగపిండి -- మూడు స్పూన్లు
తరిగిన కరివేపాకు -- పావు కప్పు
తరిగిన పచ్చిమిర్చి -- స్పూనున్నర
అల్లం కొద్దిగా మెత్తగా దంచి అర స్పూను సిద్ధంగా ఉంచుకోవాలి .
జీలకర్ర - పావు స్పూను
కారం -- అర స్పూను
ఉప్పు -- తగినంత
నూనె -- 350 గ్రాములు
ఉల్లిపాయలు -- రెండు సన్నని ముక్కలుగా తరుగు కోవాలి .
తయారీ విధానము .
ఒక గిన్నెలో సగ్గుబియ్యం వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని మూడు గంటలు సేపు నానపెట్టుకోవాలి .
ఆ తర్వాత ఆ గిన్నెలో ముప్పావు కప్పు బియ్యపు పిండి , శనగపిండి , ఉడికించిన బంగాళాదుంప ముక్కలు , సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు , తరిగిన కొత్తిమీర , సన్నగా తరిగిన పచ్చిమిర్చి , జీలకర్ర , కొద్దిగా దంచిన అల్లం , కారం మరియు తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుని పిండిని వడలు వేసే విధంగా కలుపుకోవాలి .
ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే పిండిని చిన్న చిన్న వడల్లా చేతితో తట్టి వేసుకోవాలి .
అంతే . ఎంతో రుచిగా ఉండే సగ్గు బియ్యము వడలు అల్పాహారమునకు సిద్ధం.
Comments
Post a Comment