పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు.

పల్లీలు  అంటే  వేరుశనగ   గుళ్ళు.
నువ్వుపప్పు  అనగా  తెల్లని  నువ్వు పప్పు.

కావలసినవి .

పల్లీలు  --  100  గ్రాములు .
నువ్వు పప్పు  --  50  గ్రాములు
ఎండు కొబ్బరి  --  అర చిప్ప.
చాకుతో  చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
ఎండుమిరపకాయలు  --  15
జీలకర్ర  --  స్పూనున్నర  
ఉప్పు  --  తగినంత 

తయారీ విధానము .

ముందుగా     స్టౌ  మీద  బాండి  పెట్టి  నూనె  వేయకుండా  పల్లీలను కమ్మని వాసన  వచ్చేదాకా వేయించుకోవాలి .

చల్లారగానే పల్లీల  పై పొట్టు  తీసి  విడిగా   ఉంచుకోవాలి .

మళ్ళీ   స్టౌ మీద బాండి  పెట్టి  నువ్వు పప్పు , ఎండుమిరపకాయలు మరియు  జీలకర్ర  వేసుకుని  , నూనె   వేయకుండా    వేగిన  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

చివరగా  బాండీలో ఎండు కొబ్బరి  ముక్కలు  కూడా వేసుకుని  కమ్మని  వాసన  వచ్చేదాకా  వేయించుకోవాలి.

చల్లారగానే  వేయించిన  పల్లీలు , నువ్వుపప్పు , ఎండు కొబ్బరి ముక్కలు  , ఎండుమిరపకాయలు , జీలకర్ర  మరియు  సరిపడే  ఉప్పువేసి   మిక్సీ లో  మెత్తగా  వేసుకోవాలి .

అంతే.   ఇడ్లీ , దోశెలు  మరియు  భోజనము  లోకి  రుచికరమైన  పల్లీలు  నువ్వుపప్పు   పొడి  సిద్ధం .

Comments