గుమ్మడికాయ వడియాలు తయారీ
తయారీ విధానము మీ కోసం .
మినపగుళ్ళు -- 250 గ్రాములు
గుమ్మడికాయ
లేత దైనా , లేదా
ముదురు దైనా
షుమారు --- 1 K.G కాయ
పచ్చి మిరపకాయలు ---
200 గ్రాములు
ఇంగువ ---- ముప్పావు స్పూను .
పసుపు --- ముప్పావు స్పూను
ఉప్పు -- తగినంత
నూనె --- పావు కిలో
తయారీ విధానము ---
రేపు ఉదయము భోజనాల లోకి పచ్చి వడియాలు వేసుకుందామనుకుంటే ముందు రోజు గుమ్మడి కాయను పగుల కొట్టి సొరకాయ ముక్కలు తరిగి నట్లుగా పై చెక్కుతోనే ముక్కలుగా తరుగుకొని, ముక్కలకు ఉప్పు , పసుపు వేసి ఒక గుడ్డలో మూట కట్టి అందులో నీళ్ళు కారి పోయే విధంగా పైన చిన్న రోలు కాని , లేదా బరువు కానీ పెట్టుకోవాలి .
మురుసటి రోజు ఉదయాని కల్లా ముక్కలలో నీరు కారిపోతుంది.
మరుసటి రోజు పిండిలో వేయబోయే ముందు ఒకసారి ముక్కలను కూడా చేతితో పిండుకోవాలి.
అలా ముక్కలను పిండుకుని నీరు తీయకపోతే , పిండి పలుచన అయి గారెలు వేయడానికి రావు .
మినపగుళ్ళు కూడా ముందు రోజు నాన బోసుకోవాలి .
మరుసటి రోజు నానిన పప్పు శుభ్రంగా కడిగి Wet గ్రైండర్లో పప్పు , తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోస్తూ గారెల పిండిలా గట్టిగా రుబ్బు కోవాలి .
ఇప్పుడు చాలా కొంచెం నీళ్ళల్లో ఇంగువ వేసి , స్పూనుతో బాగా కలిపి , ఆ నీళ్ళు పిండిలో వేయాలి . ఇలా ఇంగువ నీళ్ళు పిండిలో పవేసి రుబ్బుకుంటే పిండికి ఇంగువ వాసన బాగా పడుతుంది .
ఇప్పుడు పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని , గట్టిగా పిండిన గుమ్మడికాయ ముక్కలు అందులో వేసి చేతితో పిండిని బాగా కలుపు కోవాలి .
ముక్కలు కలిపిన తర్వాత కూడా , పిండి గారెల పిండిలా గట్టిగానే ఉండాలి .
పచ్చి మిరపకాయలు తొడిమలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా వేసుకుని , తర్వాత పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి .
ఉప్పు తగ్గినట్లు అన్పిస్తే పిండిలో వేసుకుని కలుపుకోండి .
భోజనానికి ముందు --
******************
స్టౌ మీద బాండి పెట్టి నూనె పోసి నూనె బాగా కాగిన తర్వాత పిండిని గారెల మాదిరిగా వేసుకోవాలి.
ఘుమ ఘుమ లాడే ఇంగువ వాసన తో పచ్చి గుమ్మడికాయ వడియాలు ( గారెలు ) భోజనము లోకి సిద్ధం .
వేడి వేడి అన్నంలో మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ గారెలను నంజుకుని తింటుంటే ఆ రుచి అద్భుతం,
Comments
Post a Comment