మైసూర్ బజ్జీ తయారీ విధానము

 ,

మైసూర్  బజ్జీ .
తయారీ  విధానము .

ఒక అర  కప్పు  పుల్లని  పెరుగులో  ఒక కప్పు  మైదా పిండి ,  రెండు  స్పూన్లు   బియ్యపు పిండి, పావు స్పూను  జీలకర్ర ,  తగినంత  ఉప్పు , కొద్దిగా  వంట సోడా  వేసి  బాగా  కలుపు కోవాలి .

అయిదు  పచ్చిమిరపకాయలు  మరియు  చిన్న అల్లం  ముక్కరోటిలో  దంచుకుని లేదా మిక్సీ లో వేసుకుని   పిండిలో  కలుపుకోవాలి .

పిండి  గట్టిగా  ఉంటే  కొద్దిగా   నీళ్ళు పోసి  కలుపుకోవాలి .

పది నిముషముల  తర్వాత
స్టౌ  మీద  బాండీ  పెట్టి షుమారు పావు కిలో   నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే  చేతితో  లేదా  స్పూనుతో బజ్జీల  లాగా  వేసుకోవాలి .

అవి  బంగారు  రంగులో  వేగనివ్వాలి,

అంతే  మధ్యాహ్నము   అల్పాహారానికి  వేడి  వేడి  మైసూరు  బజ్జీ  సిద్ధం .

ఇవి  అప్పటికప్పుడు  వేసుకుని  వేడి వేడిగా  తింటేనే  చాలా రుచిగా  ఉంటాయి.

Comments