కాకరకాయ కాయల పళంగా వేపుడు తయారీ విధానము
తయారీ విధానము .
అర కిలో కాకరకాయలు తీసుకుని కాయ మధ్యలో చాకుతో గాటు పెట్టుకోవాలి.
గింజలు తీయనవసరం లేదు. నూనెలో వేగాక గింజలు రుచిగా ఉంటాయి .
మిక్సీలో బాగా ఎండిన ఎండుమిరపకాయలు 15 , జీలకర్ర స్పూనున్నర , సరిపడా ఉప్పు , ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కారం మెత్తగా వేసుకోవాలి .
వెల్లుల్లి ఇష్టపడని వారు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుని కారము మిక్సీ వేసుకోవచ్చు .
ఈ కారం విడిగా సీసాలోకి తీసుకోవాలి .
మూడు నాలుగు సార్లకు వస్తుంది .
స్టౌ మీద బాండీ పెట్టి ఓ 150 గ్రాముల నూనె వేసి , ముందుగా సిద్ధం చేసుకున్న కాకరకాయలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి .
తర్వాత కాయలు విడిగా ప్లేటులో తీసుకుని పైన చెప్పిన కారము కాయలలో కూరి వేడి వేడి నూనె రెండు స్పూన్లు చొప్పున కాయలలో వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కాయల పళంగా వేపుడు సర్వింగ్ కుసిద్ధం.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కూరతో తింటే చాలా రుచిగా ఉంటుంది .
Comments
Post a Comment